హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్టైక్ చేస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ ఫైర్ అయ్యారు. ఓట్లు, సీట్ల కోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు. సంజయ్ వ్యాఖ్యలను హోంశాఖ సహాయకమంత్రి కిషన్ రెడ్డి సమర్ధిసారా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని కెటిఆర్ బిజెపి నాయకులను హెచ్చరించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని బిజెపి నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. నాలుగు ఓట్ల కోసం బిజెపి నేతలు ఇంతగా దిగజారాలా..? అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. పూల బొకేలాంటి హైదరాబాద్ ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బిజెపి నేతలపై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నో హెట్ పాలిటిక్స్.. హైదరాబాద్ ఫస్ట్ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.
KTR fires on Bandi Sanjay surgical strike comments