Wednesday, May 8, 2024

శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ది క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనార్ధం భక్తజనులు పోటెత్తారు. అదివారం సెలవు దినములు కావడంతో యాదాద్రి వాసుని దర్శనానికి వివిధ ప్రాంతాలనుండి భక్తులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రము నుండే భక్తులు కుటుంభ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనార్ధం యాదాద్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన అర్చక స్వాములు సుప్రభాత సేవ నిర్వహించారు.

శ్రీవారి దర్శనానికి తెల్లవారు జామునుండి ఆలయం చేరుకున్న భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శంచుకొని ఆలయ నిత్యపూజలు అభిషేకం,అర్చన, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పర్చన, వేండి జోడి సేవ, శ్రీత్యనారాయణ వత్రపూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.శ్రీవారి దర్శనము తోపాటూ కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివదర్శనము తోపాటూ కొండ కింద శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దర్శించుకొని ఆలయ నిత్యపూజలలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనినికి సుమారు 3 గంటలపైగా భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.

ఆలయ నిత్యరాబడి…

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ఆలయ నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రోజున 54,66,013 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వార 21,25,600 కొండపైకి వాహన అనుమతితో 6,00,000, ప్రధాన బుకంగ్ ద్వార, 6,80,750 విఐపి దర్శనము ద్వార 3,90,000 బ్రేక్ దర్శనముతో 4,12,800 వ్రతపూజలతో 2,04,000 తోపాటూ పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి సమకూరినట్లు తెలిపారు.

శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఐఏఏఎస్

శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రిన్సిపల్ ఆడిటర్ జనర్ సిఏజి భారత ప్రభుత్వ ఐఏఏఎస్ అధికారి కె.జితేంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనము చేసి తీర్ధ ప్రసాదమును అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News