- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోన్న నేపథ్యంలో గురువారం నాడు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజుల పాటు కేసుల ప్రత్యక్ష విచారణ విధానం పాక్షికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొంతకాలం పాటు విచారణ పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టాలని నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం కొన్ని బెంచ్లు ఆన్లైన్లో, మరికొన్ని బెంచ్లు ఆఫ్లైన్లో విచారణ చేపడుతుండగా ఇక నుంచి అన్ని బెంచ్లు ఆన్లైన్లోనే విచారణ చేయాలని నిర్ణయించింది.
- Advertisement -