Thursday, May 2, 2024

రేపు క్రీడాకారులకు బత్తాయి పండ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో దాదాపు 500 మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయనున్నట్టు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్.బి.స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా క్రీడాకారులకు ఫలాలు అందించడం జరుగుతుందన్నారు. అంతేగాక ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ బత్తాయి డేను విజవంతం చేయాలని చైర్మన్ కోరారు.

ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ ఆడడం ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. క్రికెట్ ఆటకు అభిమానులే ప్రాణమని, వారు లేకుండా మ్యాచ్‌లు ఆడితే మజా ఏమీ ఉండదన్నాడు. అయితే కరోనా మహమ్మరి నేపథ్యంలో కొన్ని రోజుల పాటు క్రికెట్‌కు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి తప్పదన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News