Thursday, May 2, 2024

క్షణికావేశంలో నేరాలకు పాల్పడవద్దు

- Advertisement -
- Advertisement -

జన్నారం : క్షణికావేశంలో నేరాలకు పాల్పడవద్దని, దీంతో రకరకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని, రాజీ మార్గమే రాజ మార్గమనే ఆలోచనతో ముందుకు సాగాలన్నారు.

చిన్న చిన్న తగాదాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించి పరిష్కరించుకోవడానికి దృష్టి సారించాలన్నారు. అనవసరంగా సంబంధాలు లేని కేసుల్లో ఇరుక్కోకూడదని, దీంతో తమపై ఆధారపడిన వారు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. స్థానికంగా సమస్యలు పరిస్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకువస్తే కౌన్సిలింగ్ ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తానని తిరుపతిరెడ్డి తెలిపారు. శాంతి భద్రతలకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News