Saturday, April 27, 2024

పేదల ఆరోగ్యమే సిఎం కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు స్థానిక నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వారికి అండగా ఉంటా మని ఎమ్మెల్యే అత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుండి మంజూరు అయిన జైనూర్ మండల కేంద్రంకు చెందిన నాజీయబేగంకు 28 వేలు,

ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన యశ్వంత్‌రావుకు 16 వేలు, రాజురా గ్రామానికి చెందిన శివరాంకు 60 వేలు, మోతుగూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు 24 వేలు, అడ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌కు 26 వేలు, కెరమెరి మండలం గోయగాం గ్రామానికి చెందిన కళాబాయికి 12 వేలు, బాబేఝారి గ్రామానికి చెందిన జంగు కు 44 వేలు తదితరులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News