Sunday, April 28, 2024

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక
జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు
కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా
విక్రయాలు చేయాల్సిన నిత్యావసరాలు నిల్వ చేస్తే చర్యలు
మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో పారిశుధ్యం నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు
శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల్సిందే… విత్తనాలు, ఎరువుల డీలర్లు దుకాణాలు పనిచేస్తాయి
వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి ప్రత్యేక ఉత్తర్వులు

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులను రైతు బజార్లకు, హోల్‌సేల్ మార్కెట్లకు తరలిస్తున్న రైతులకు లాక్‌డౌన్ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఉన్న కూరగాయలు, పండ్లకు ఉన్న రేట్లు ప్రాతిపదికగా తీసుకుని విక్రయాలు జరపాలని ఆదేశించించింది. కరోనా మహమ్మారి పేరుతో సంక్షోభాన్ని సృష్టించడం, దోపిడీ చేయడం, విపరీతమైన ధర పెంపు చేయరాదని తెలిపింది. జిల్లాల్లో కలెక్టర్లు ధర నిర్ణయించి, పర్యవేక్షణ చేస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి మార్కెటింగ్, ఉద్యాన శాఖల తీసుకోవాల్సిన చర్యలు, ఎరువులు, విత్తనాల సరఫరాపై సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన అమ్మకాల కోసం ఏ రైతు అయినా తన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో నిల్వ చేయాలనుకుంటే, అలాంటి రైతులు ఎటువంటి ఛార్జీలు లేకుండా అనుమతించాలి. రాష్ట్రంలోని టోకు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లకు, హమాలీలు, దడువైలకు కూడా లాక్‌డౌన్ నిబందనలు వర్తించవు. అయితే కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు రోజూ తమ షాప్‌లో పనిచేస్తున్న వారందరికీ చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ శానిటైజర్లను అందించాలి.మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే రైతు బజార్, వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలను ఉంటాయని హెచ్చరించారు. చెత్తను శుభ్రపరిచే కాంట్రాక్టర్లు ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేసే వాహనాలు రాష్ట్రంలో లాక్-డౌన్‌లోనూ అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు.

మార్కెటింగ్ విభాగం

* అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డులు, రైతు బజార్లలోని అన్ని క్యాంటీన్లు, టాయిలెట్ బ్లాక్స్, వాటర్ పాయింట్స్ మొదలైన వాటిలో హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
* ఉత్పత్తులతో పాటు మార్కెట్ యార్డ్‌లోకి ఒక వ్యక్తిని (రైతు) మాత్రమే అనుమతించాలి.
* రైతు బజార్లలో కూరగాయలు, ఇతర వస్తువుల అమ్మకాలకు సంబంధించి, క్రమబద్ధమైన కొనుగోలు కోసం ఇద్దరి కస్టమర్ల మధ్య మీటర్ కంటే ఎక్కువ దూరం ఉండేలా చూడాలి. ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు కొనుగోళ్లు జరిపే సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. * పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూరగాయల రేట్లను మార్కెటింగ్ అధికారులు నిరంతరం ప్రకటించాలి.
* అంతరాష్ట్ర సరిహద్దులను పర్యవేక్షించే పోలీసులు, కూరగాయలు, పండ్లను టోకు మార్కెట్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలించడానికి అనుమతిస్తారు.
* వీలైనంతవరకూ రైతులకు చెల్లింపులతో సహా హోల్‌సేల్ ఎఎమ్‌సిలలోని అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఉండాలి.
వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు బజార్లలో (స్వయం సహాయక సంఘాలు) పనిచేస్తున్న అన్ని కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు ప్రజల కొనుగోలు కోసం ఉద్దేశించిన వస్తువులను నిల్వ చేయరు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయి.
ఉద్యాన శాఖ
వ్యవసాయ మార్కెటింగ్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్, జిల్లాలకు కూరగాయలు, పండ్ల సరఫరా, ధరలను పర్యవేక్షించడానికి ఉద్యాన శాఖ అంతర్గత పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లా పరిపాలన సమన్వయంతో స్థానిక మండీస్, రైతు బజార్లకు తాజా కూరగాయలు, సీజనల్ పండ్ల సరఫరాను కమిటీ నిర్ధారిస్తుంది.
* ఉద్యాన శాఖ మున్సిపల్ ప్రాంతాల్లో కూరగాయల అవసరాన్ని రోజువారీగా అంచనా వేయడం. ప్రస్తుత పంటల వారీగా సాగు అంచనా, ఉత్పత్తి వివరాలు సేకరిస్తుంది.
* సంక్షోభాన్ని అధిగమించడానికి అవసరమైన పంటల కింద కూరగాయల విస్తీర్ణాన్ని పెంచే భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలి.
* ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కూరగాయలను రవాణా చేయకుండా ఉండటానికి ఎక్కడి వారి అవసరాలకు అక్కడే పండించుకునేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలి.
విత్తనాలు.. ఎరువులకు ఇలా
* ఇక విత్తనాలను రైతుల పొలాల నుండి ప్రాసెసింగ్ ప్లాంట్లకు, ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ నుండి ఇతర ప్రాసెసింగ్ ప్లాంట్ నుండి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుండి రిటైలర్లకు తీసుకువెళ్ళే వాహనాలు తగిన తనిఖీల తరువాత ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అనుమతిస్తారు. విత్తన కంపెనీలు ఖచ్చితంగా సూచనలు పాటించాల్సిందే.
* విత్తన డీలర్లు లాక్ డౌన్ కాలంలో పనిచేయాల్సిందే. అన్ని ఎరువుల డీలర్ దుకాణాలు తెరిచి ఉంటాయి.
* ఎరువుల రేక్‌లలో పాల్గొనే హమాలీ యూనియన్లు, లారీ రవాణా సంఘాలు, అన్‌లోడ్, లోడ్ చేయడానికి నియమించిన ఇతర సిబ్బంది, ఏజెంట్లు, స్థానిక కాంట్రాక్టర్లు కొవిడ్ భద్రతా చర్యలను అనుసరించి కార్యకలాపాలను కొనసాగించాలి.
* డీలర్లు హ్యాండ్ శానిటైజర్లను అందించడం, బయోమెట్రిక్ చేసే కంటే ముందు, తరువాత కొనుగోలుదారులు చేతి శుభ్రం చేయించాలి.

Don’t increase with Corona virus in telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News