Monday, May 13, 2024

ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి

- Advertisement -
- Advertisement -

Drone strike on Iraqi PM's residence

 

రియాద్: అత్యంత భద్రత నడుమ గ్రీన్‌ జోన్‌లో ఉండే ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కధిమిపై హత్యాయత్నం జరిగింది. రాజధాని బాగ్ధాద్‌లో అత్యంత భద్రత నడుమ ఉండే ప్రధాని ముస్తఫా నివాసంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్‌ దాడి జరిగింది. అయితే ఈ హత్యాయత్నం నుంచి ప్రధాని క్షేమంగా బయటపడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. డ్రోన్‌ దాడితో అప్రమత్తమైన ఆర్మీ ప్రధాని ముస్తఫాను సురక్షిత ప్రాంతానికి తరలించింది. తాను క్షేమంగానే ఉన్నానని, దేశ ప్రజలంతా శాంతియుతంగా, సంయమనంతో ఉండాలని ప్రధాని ముస్తఫా ట్వీట్‌చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News