Sunday, April 28, 2024

తల్లి మరణవార్త విని కొడుకు హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

Son died suddenly after hearing news of mother's death

 

అనంతపురం : తల్లి మరణవార్త విన్న ఎఎస్సై హఠాన్మరణం చెందిన ఘటన జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెల్తే.. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి పామిడి పోలీస్ స్టేషన్ లో ఎఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించారు. వెంకటస్వామి తల్లి కోన్నమ్మ అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. తల్లి ఆరోగ్యం గురించి దిగులుపడుతూనే ఆయన కుమారుడి వివాహాన్ని జరిపించారు. వివాహం జరిగిన కాసేపటికే కోన్నమ్మ ఆసుపత్రిలో మరణించారు. విషయాన్ని బంధువులు ఫోన్ లో వెంకటస్వామికి చెప్పడంతో ఆయన ఒక్కసారిగా కూప్పకూలిపోయి, హఠాన్మరణం చెందారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News