Thursday, May 2, 2024

వంటలో పేడ వేసిన ఎస్ఐ….

- Advertisement -
- Advertisement -

Dungs dust throw in rice in AP

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా టిడిపికి చెందిన దళిత అభ్యర్థి తన మద్దతుదారులకు వంటచేసి పెట్టడంపై స్థానిక ఎస్‌ఐ అగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వండిన వంటలో పేడ, బొగ్గులు వేసిన సంఘటన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… పంచాయతీ ఎన్నికలలో టిడిపి తరఫున ఎస్‌సి మహిళ లక్ష్మీదేవీ బరిలోకి దిగింది. తన వెంట ప్రచారానికి వచ్చిన టిడిపి కార్యకర్తలకు వంట వండింది. ఎస్‌ఐ హరూన్ భాషా తన సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చాడు. భోజనం వండడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ వారిపై అగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడు. వండిన వంటలో పేడ, బొగ్గులు వేశాడు. అనంతరం పొయ్యిలోని మంటలను ఆర్పేసి టిడిపి కార్యకర్తలను చెదరగొట్టారు. టిడిపి కార్యకర్తల ఫిర్యాదు మేరకు స్థానిక సిఐ శివశంకర్ నాయక్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తప్పిదం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ పయ్యావుల కేశవులు అక్కడి చేరుకొని బాధితులను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News