Sunday, May 5, 2024

భారత్ లో కొత్తగా 11,067 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India corona cases last 24 hours

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 11067 కేసులు నమోదుకాగా 94 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరుకోగా 1.55 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 1.05 కోట్ల మంది కోలుకోగా  ప్రస్తుతం 1.41 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం ఒక్క రోజే 13,087 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు భారత్ లో 66,11,561 మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో 7.36 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 20.33 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News