- Advertisement -
గాంధీనగర్: గుజరాత్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం సూరత్ లోని భరూచ్ లో భూమి కంపించినట్లు భూ కేంద్ర పరిశోధకులు వెల్లడించారు. రిక్టర్ స్టేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు తెలిపారు. నార్త్ ఈస్ట్ సూరత్ కు 53 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భూ ప్రకంపనల వలన ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
Earthquake Strikes Near Surat In Gujarat
- Advertisement -