అమరావతి: కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 80,082 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా మరో 2,367 మందికి కోవిడ్ పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ బారిన పడి 11మంది బాధితులు మృతి చెందారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,730కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 6,779 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24గంటల్లో 2,747 మంది కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 8లక్షల 12,517మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 21,434మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ మందికిపైగా కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య అధికారులు వెల్లడించారు.
2367 New Corona Cases Registered in AP