Tuesday, April 30, 2024

పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం: ఈటెల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం సాధిస్తుందని, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు మరోసారి గెలిపిస్తాయని మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తన జన్మదినం సందర్భంగా నియోజకవర్గం బిజెపి మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ, ఈటల ష్యురిటీ పేరుతో విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార వివరాలు, బిజెపి పథకాలతో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. శామీర్ పేట తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వేలాదిగా తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడుతూ మే 13న దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావం మల్కాజిగిరిలో స్వయంగా ప్రధాని మోడీ ప్రారంభించారని,

యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదాన్ని నిజం చేయాలని సమర శంఖం పురించారని పేర్కొన్నారు. ఆంక్షలు, ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు లక్షలాదిగా పాల్గొన్న తీరును చూపించిన ప్రేమకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞుడిగా ఉంటానని మరుసటి రోజు జరిగిన నాగర్ కర్నూల్ సభలో, జగిత్యాల సభలో మోడీ చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుందని, ఏ అకుంఠిత దీక్ష కోసమైతే పోరాడేమో అదంతా మీ కళ్ళ ముందు ఉన్నదన్నారు. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసి ప్రజలకు సేవలందించినట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. గ్రేటర్ నగరంలో పేదవారికి స్థలం కొనుగోలు చేసే భాగ్యం లేకుండా పోయిందని, సొంత ఇంటి కలగానే మిగిలిందన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 37 వేల ఇల్లు మంజూరు చేసిన వాటిని నిర్మించి పేదలకు పంచడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం రాజధానికి వచ్చిన పేదలతో సహా ఇక్కడ ఉండేవారికి సొంత ఇంటి కల నెరవేర్చడంలో తాను కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.

వైద్యం మీద పెట్టే ఖర్చు అనుకోకుండా వచ్చి పడే పిడుగు లాంటిదని, పేదవారికి వైద్య అవసరాల కోసం డబ్బులు లేక అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం మనుషులకు దూరమైతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ , ఎయిమ్స్‌తో పాటువైద్య సౌకర్యాల కల్పనలో మరింత చేరువ చేసే ఏర్పాటు చేస్తానన్నారు. స్థానికంగా డ్రైనేజ్ , రోడ్లు, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు ఉంది దరఖాస్తు చేస్తే సమస్యలు పరిష్కారిస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News