Tuesday, April 30, 2024

ఎన్‌సీపీ ఎంపీ ఆస్తుల ఎటాచ్.. వాటి విలువ రూ. 315 కోట్లు …!

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎంపీ ఈశ్వర్‌లాల్ శంకర్‌లాల్ జైన్ లాల్వానికి చెందిన ఆస్తులను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) అటాచ్ చేసింది. విండ్‌మిల్స్, బంగారం, వజ్ర, వెండి ఆభరణాలు వంటి 70 స్థిర, చరాస్తులను సీజ్ చేసింది. వీటితోపాటు ముంబై, జల్‌గావ్, థానే , కచ్ వంటి ప్రాంతాల్లోని స్థిరాస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకొంది.

వీటి విలువ రూ. 315 కోట్లు. ఆయన రాజ్‌మల్ లాల్‌చంద్ జ్యువెల్లర్స్, ఆర్‌ఎల్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెండ్, మన్‌రాజ్ జ్యువెల్లర్స్ సంస్థలకు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనపై బ్యాంక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ వంటి అభియోగాలున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశ పూర్వకంగా రూ. 352 . 49 కోట్ల నష్టం వాటిల్లేట్టు చేశారన్నది ఈశ్వర్‌లాల్‌పై ఉన్న ఆరోపణలు. ఈ మేరకు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

“ ఈ కంపెనీల ప్రమోటర్లు రుణాల కోసం తప్పుడు వివరాలు ఇవ్వడం, ఆర్థిక వివరాలు పెంచి చూపడానికి రౌండ్‌ట్రిప్ లావాదేవీలు చేయడం, ఆడిటర్లతో కుమ్మక్కవడం వంటివి చేశారు ” అని ఈడీ పేర్కొంది. దీనికి సంబంధించి ఆగస్టులో ఏజెన్సీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన దర్యాప్తులో చాలా బంగారం, నగల వివరాలు బుక్స్‌లో తప్పుగా చూపించారు. డమ్మీ కంపెనీలు, వాటి డైరెక్టర్ల నియామకాలను కూడా చేపట్టారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News