Tuesday, May 21, 2024

మళ్లీ ఈడీ నోటీసులు.. విచారణకు హాజరుకాలేనంటూ కవిత లేఖ

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ అధికారులు, కవితకు సమన్లు జారీ చేశారు. దీనికి స్పందించిన కవిత.. తాను విచారణకు రాలేనని ఈడీకి లేఖ రాశారు. తను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని.. కాబట్టీ తాను ఈరోజు విచారణరకు హాజరుకాలేనని లేఖలో తెలిపింది.

గతంలో కూడా మూడుసార్లు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించింది. అయితే, మహిళ ఇంటి వద్ద నుంచి విచారించాలని, లేదా వీడియో రికార్డు ద్వారా విచారించాలని ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News