Sunday, April 28, 2024

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: హన్మకొండలోని జడ్పి క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని రెడ్డి సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు గోపు జైపాల్‌రెడ్డి, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, గుజ్జుల శ్రీనివాసరెడ్డి, వీసం సురేందర్‌రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News