Sunday, April 28, 2024

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

భారత్‌లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్
త్వరలో హైద్రాబాద్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Electra Electric Tipper Trials

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6 x 4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్‌ను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామి, మార్కెట్ లీడర్‌గా ఉన్న ఒలెక్ట్రా ట్రక్కుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఇది భారత దేశంలోనే మొట్టమొదటిది. సింగిల్ ఛార్జితో 220 కి.మీ. ప్రయాణం చేయవచ్చు.

ఈ టిప్పర్ 25 శాతం డ్యూటీ బోగీ సస్పెన్షన్ కలిగి ఉంది. త్వరలో హైదరాబాద్ శివార్లలో అత్యాధునిక సదుపాయాలతో ఉత్పత్తి యూనిట్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్, ఎండి కెవి ప్రదీప్ మాట్లాడుతూ భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా ఇప్పుడు హెవీ డ్యూటీ టిప్పర్ ట్రయల్స్‌ను ప్రారంభించిందన్నారు. దేశంలో ఈ రకమైన ట్రక్ ఇదే మొదటిది కావడం గర్వకారణం. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, ఎలక్ట్రిక్ ట్రక్కులు ఈ రంగంలో గేమ్- ఛేంజర్‌గా మారతాయి. ఈ టిప్పర్ పనితీరు అద్భుతంగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News