- Advertisement -
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే-ఇ-మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వా గ్రమంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సాయుధ బలగాలతో కలిసి వారు ఏడు గంటల సమయంలో నిర్భంద తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే మృతి చెందారు.
- Advertisement -