- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,481 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,34,152 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,319కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,451 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,14,917 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,916 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 40,081 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ల సంఖ్య 41,55,597 కు చేరింది.
- Advertisement -