Sunday, April 28, 2024

సిఎం రేవంత్‌రెడ్డివి ఊసరవెల్లి మాటలు: ఈటెల

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఊసరవెల్లి మాటాలు మాట్లాడుతున్నారని, మొదటిసారి వచ్చినప్పుడు ప్రధాని మోడీని మాపెద్దన్న అని ప్రస్తుతం మోడీ గిడి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ దుయ్య బట్టారు. శుక్రవారం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ సిఎం రేవంత్ నువ్వు చిన్న మనిషివి, అధికారం మీ అమ్మ నాన్న ఇచ్చింది కాదని, బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌ను ఓడగొట్టడానికి ప్రజలు ఇచ్చిందని, ప్రధాని మోడీని విమర్శించిన వారు ఏమైపోయారో చూశామని, నీకు అదే గతిపడుతుందన్నారు. ఇటీవల జరిగిన చిన్న ఎన్నికలు అని కాంగ్రెస్‌కు వేశామని, ఇప్పుడు పెద్ద ఎన్నికలు మోడీకే వేస్తాం అంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు ఉందో లేదో యువత చెక్ చేసుకోవాలని,తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సుస్థిర, సుసంపన్న, శాంతియుత పాలన కావాలంటే మోడీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

వరంగల్ సీటు ఇస్తా అంటే వద్దు అని పారిపోతున్నారని, బిఆర్‌ఎస్ మొన్నటి వరకు అన్నింటిలో నంబర్ వన్ అని చెప్పుకున్నారని, కానీ ఇప్పుడు పోటీ చేయడానికి నాయకులు దిక్కులేరని ఎద్దేవా చేశారు. ఇటీవల గెలిచిన నాయకులంతా వరుసగా జారిపోతున్నారని, మూడోసారి బిజెపికి అధికారం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులు, నాతో పాటు టిఆర్‌ఎస్‌లో పనిచేసిన నాయకులు తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బిజెపికి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పుట్టిన యూపీలోనే నీకు అడ్రస్ లేక వేరే సీట్లో గెలిచారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేస్తే దేనికంటే దానికి సిద్దమని సవాల్ విసిరారు. మల్కాజిగిరి నరేంద్రమోడీ గుండెల్లో పెట్టుకున్న నియోజకవర్గమని, ఈ ప్రజల ప్రేమకు ముగ్ధులు అయ్యారని నాగర్ కర్నూల్, జగిత్యాలలో చెప్పారని, ఈ ప్రేమతో జీవితం దైన్యం అయ్యిందన్నారు. బిజెపి గెలిచే 400 స్థానాల్లో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండబోతుందని, ప్రజల భాగస్వామ్యంతోనే మల్కాజిగిరి మోడీ రోడ్ షో విజయవంతమైందన్నారు.

కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపుల నిలబడి స్వాగతం పలికారని, తెలంగాణ గడ్డ మీద ప్రజల సంఘీభావం మోడీ మదిలో చిరస్థాయిగా నిలచిపోయిందని పేర్కొన్నారు. కేవలం నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా మోడీ ప్రభంజనం బలంగా ఉంది అని నిరూపించారు.ఈసారి మాకు పార్టీ జెండా సిద్ధాంతం సంబంధంలేదు మావోటు మోడీ, ఈటల రాజేందర్‌కే అని చెబుతున్నారని వెల్లడించారు. ప్రపంచదేశాలు కూడా మళ్ళీ మోడీ ప్రధాని అవుతారని నమ్ముతున్నారని, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని మన నరేంద్ర మోడీనేని, ఆయన హయాంలో 12 కోట్ల మరుగుదొడ్డు నిర్మించారని తెలిపారు. బాంబుల మోతలు లేవు తెగిపడ్డ శరీరాలు లేవు
పుల్వామా దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసి బదులు తీర్చుకున్నారన్నారు. ప్రజలు డబ్బు, మద్యంకు పాతర వేసి, ధర్మాన్ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఆర్కే శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ వెంకటేష్, గోలీమధుసుదన్ రెడ్డి, వీకే మహేష్, వేణుగోపాల్ రెడ్డి, ,కార్పొరేట్లు శ్రవణ్, సునీత, టీమ్ సాయి, భానుప్రకాష్, గిరివర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, ప్రసన్న, వాసంశెట్టి శ్రీనివాస్, నరసింహ గౌడ్, వద్ది సుబ్బారావు, ప్రీతం రామకృష్ణ, మడిపడిగే జగదీష్, గణేష్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News