- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిపుణుల బృందం ప్రణబ్కు వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం తన తండ్రి ప్రాణాధార వ్యవస్థలు అదుపులోనే ఉన్నాయని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్ను ఈ నెల 10న హాస్పిటల్లో చేర్చి సర్జరీ నిర్వహించారు. ఆయనకు కరోనా పాజిటివ్ కూడా నిర్ధారణ కావడంతో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
EX PM Pranab Mukherjee Health Declines
- Advertisement -