Wednesday, May 15, 2024

గ్యాస్ రీఫిల్ సెంటర్ లో పేలుడు.. ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

Explosion at Gas Refill Center in hyderabad

జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్ లో బుధవారం పేలుడు సంభవించింది. గ్యాస్ రీఫిల్ సెంటర్ లో పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా గ్యాస్ రీఫిల్ చేస్తున్నట్టు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పేట్ బషీర్ బాద్ పోలీసులు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News