Friday, May 10, 2024

ఆలస్యంగా ఇంటికి చేరిందని పదేళ్ల బాలికను హతమార్చిన తండ్రి

- Advertisement -
- Advertisement -

Father beats daughter to death for coming home late

 

మొరేనా: క్రమశిక్షణ పేరుతో కన్నతండ్రే కసాయిగా మారి పదేళ్ల కూతురిని కడతేర్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నవరాత్రి సంబరాల్లో పాల్గొని ఆలస్యంగా ఇంటికి వెళ్లినందుకు అంతమొందించాడు. ఈ హృదయవిదారక ఘటన వివరాల్ని మొరేనా నగర పోలీసులు సోమవారం వెల్లడించారు. మొరేనాలోని ఉత్తమ్‌పురా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నవరాత్రుల సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద తోటి పిల్లలతో బాలిక ఆడుకుంది. రాత్రి 9 గంటలకు ఇంటికి చేరింది. ఆ సమయంలో తాగిన మైకంలో ఉన్న ఆమె తండ్రి రాకేశ్‌జాతవ్(40) ఆగ్రహంతో ఊగిపోయాడు. రాత్రివేళ ఎక్కడికెళ్లావంటూ కర్రతో బాలికను చితకబాదాడు. దాంతో, బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలియగానే అక్కడికి వెళ్లి రాకేశ్‌ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News