- Advertisement -
పాల్ఘర్ : ఓ తండ్రి తన 20 ఏళ్ల కూతురిని సుత్తితో కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. తిరుపతినగర్కు చెందిన దత్తారామ్జోషి (54) కూతురు ఆకాంక్ష స్థానిక కళాశాలలో బిఎస్సీ ఫైనల్ చదువుతున్నారు. శనివారం ఉదయం తన భార్య, పెద్ద కుమారుడి సమక్షంలోనే దత్తారామ్ కూతురిని చంపేసినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై కుటుంబసభ్యులెవరూ నోరు మెదపడంలేదని పోలీసులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతోనే దత్తారామ్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఆర్నాలా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆకాంక్ష ఫోన్కాల్స్ డేటాను పరిశీలించి దర్యాప్తు జరపనున్నట్టు ఆయన తెలిపారు.
- Advertisement -