Thursday, May 2, 2024

రూ.22 వేలకు శిశువు అమ్మకం

- Advertisement -
- Advertisement -

Parents sell their newborn baby

 

స్థానికుల సమాచారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు

మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: నవ మాసాలు మోసి కన్న ప్రేమకు మచ్చతెచ్చే విధంగా దంపతులు వ్యవహరించారు. పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టి తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేశారు. ఈ అమానుష సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బతుకమ్మబండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బతుకమ్మబండకు చెందిన సరిత, సింగ్‌లు దంపతులు. సరిత నెల రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అయితే వరంగల్‌కు చెందిన దేవికి బాబు కావాలని గాజులరామారం లాల్‌సాబ్‌గూడబస్తీకి చెందిన శేషు మహిళకు చెప్పడంతో శేషు సరిత భర్త సింగ్‌కు మాయమాటలు చెప్పి రూ.22వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు ఇవ్వడంతో ఆమె ఓ బ్యాగ్‌లో వేసుకుని బాబుని మరో ఇద్దరు యాదమ్మ, మహేష్‌లతో కలిసి వరంగల్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. భార్య సరిత ఏడుస్తుండటంతో గమనించిన స్థానికులు బాబు గురించి అడుగగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరంగల్‌కు తరలిస్తున్న మహేష్‌ను సికింద్రాబాద్‌లో పట్టుకుని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమ్మిన వారిని, కొనుగోలు చేసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాబు కావాలని కోరిన వరంగల్‌కు చెందిన దేవి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News