Sunday, April 28, 2024

అటవీశాఖ అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్ ఎఫ్‌బీవో శిక్షణ పొందుతున్న 33వ బ్యాచ్‌కు క్షేత్రస్థాయిలో శిక్షణను ఇచ్చారు. దూలపల్లిలో శిక్షణ పొందుతున్న అటవీ అధికారులు ములుగులోని ఆటవీ కళాశాల పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. పరిశోధన కేంద్రంలో అటవీ శాస్త్రానికి సంబంధిం చిన పలు అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కళాశాల పరిశోధన కేంద్రంలో ప్రయోగశాలలు, మ్యూజియం, ట్రీపార్కు, వైల్ ఫ్రూట్ గార్డెన్, తేనెటీగల పెంపకం తీరుతెన్నుల గురించి వారికి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, సహాయ ఆచార్యులు కపిల్‌సింగ్, చిరంజీవి. శైలజ, హరీశ్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News