స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ ఇటీవల ఒక పాపకు జన్మనిచ్చింది. ఆమె మళ్ళీ నటిస్తాను అంటోంది. తన కూతురుకి ఆరు నెలలు నిండాక రీ-ఎంట్రీ ఇస్తాను అంటోంది. అందుకే, గతంలో ఒప్పుకున్న సినిమాలను వదులుకోవడం లేదు. అయితే తాజాగా మద్దోక్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్న హారర్ చిత్రం నుంచి ఆమెని తొలగించి ‘సయారా చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న అనీత్ పడ్డని తీసుకున్నారు అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఎవరినీ తొలగించలేదు, ఎవరినీ తీసుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. తమ కొత్త సినిమా నటీనటులని ఇంకా ఫిక్స్ చెయ్యలేదు అని ప్రకటించింది. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల బాలీవుడ్లో విజాయవంతమైన చిత్రాలు తీస్తోంది. స్త్రీ2, చావా వంటి బ్లాక్బస్టర్స్ తీసింది. త్వరలోనే రష్మిక మందన్న హీరోయిన్గా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన తమ్మ కూడా విడుదల చేయనుంది.
Also Read : భారీ యాక్షన్ సీన్స్ కోసం స్టంట్స్ ప్రాక్టీస్