Thursday, May 2, 2024

నేతన్నలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసి.. వారి ఖాతాల్లోకి నిధులను రెండు విడతల్లో విడుదల చేసింది. ఇందులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి.. గతేడాది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ కింద ఉన్న 33 మంది అవార్డు పొందిన నేతన్నలకు

కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ రూ. 30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇందులో తెలంగాణ నుంచి 33 మంది ఖాతాల్లోకి… ఒక్కొక్కరి.. నెలకు రూ. 8వేల చొప్పున సంవత్సరం మొత్తానికి కలుపుకుని రూ.96 వేలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేసింది. దేశవ్యాప్తంగా 68 మంది లబ్ధిదారుల అకౌంట్లలోకి రూ. 62లక్షల జమ చేయగా.. ఇందులో సింహభాగం.. రూ. 30 లక్షల.. రాష్ట్రానికి చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

 నేతన్నలకు అండగా నిలుస్తాం : కిషన్‌రెడ్డి
వోకల్ ఫర్ లోకల్’ పేరిట స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం నేతన్నల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. నేతన్నల సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా, అన్ని రకాల పండుగలకు, శుభకార్యాలకు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News