Monday, April 29, 2024

సింగరేణి కార్మికులకు 21న తొలి విడత ఏరియర్స్

- Advertisement -
- Advertisement -

నెల రోజుల్లోగా చివరి విడత ఒక్కో
కార్మికుడికి సగటున రూ.4లక్షల చెల్లింపు

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో పని చేస్తున్న సుమారు 40వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయ లను బకాయిలను చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం నిర్ణయిచింది. మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయి లను ఈ నెల 21న బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనన్నట్లుగా ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సి ఉన్న 23 నెలల 11వ వేజ్ బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్ పర్సనల్) ఎన్.బలరామ్ సారథ్యంలో ముమ్మర ఏర్పాట్లను చేపట్టారు.

ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1726 కోట్ల ను బకాయిలుగా చెల్లించనున్నామని, సగటున కార్మికుడు సుమా రుగా రూ.4 లక్షల వరకు ఎరియర్స్ అందుకుంటాడని ఎన్.బల రా మ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా పెద్దమొత్తంలో వేతన బకాయిలను చెల్లిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఉండేందుకు వీలుగా నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామన్నారు. వేతన బకాయిల లెక్కింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి పర్సనల్ విభాగం, అకౌంట్స్, ఆడిటింగ్, ఈఆర్పీ, ఎస్‌ఏపీ, ఐటీ తదితర అన్ని విభాగాల సమన్వయంతో ప్రక్రియ ప్రారంభించామన్నారు.

ముందుగా ఉద్యోగుల వేతన బకాయిల అడిటింగ్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, అనంతరం ప్రోగ్రామ్ రూపకల్పన, ఎస్‌ఏపీ టెస్ట్ రన్లను కూడా తక్కువ సమయంలో పూర్తి చేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏ దశలోనూ జాప్యం జరగరాదని స్పష్టం చేశారు. నెలరోజులలోపు చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించడం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 11వ వేజ్ బోర్డు ను వేతనాలను అందరికన్నా ముందే సింగరేణి లో అమలు జరిపామని, ఈ మేరకు కంపెనీకి ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల అదనపు వ్యయం అవుతోందని, దీనితోపాటు ప్రస్తుతం చెల్లించే ఎరియర్స్ రూ.1726 కోట్లతో కలిపి మొత్తం దాదాపు 3 వేల కోట్ల చెల్లింపులను చేయనుందని పేర్కొన్నారు. ఈ బకాయిలను ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న కార్మికులకు చెల్లిస్తున్నామని, పదవీ విరమణ చేసిన కార్మికులకు త్వరలో చెల్లిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News