ఛండీగఢ్: ఒకే ఇంట్లో ఐదుగురిని హత్య చేసిన సంఘటన పంజాబ్లోని టారన్టార్న్ ప్రాంతంలో జరిగింది. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురుతో పాటు డ్రైవర్ ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్రిజల్ సింగ్ అనే వ్యక్తి డ్రగ్ మాఫియా నడిపించేవాడు. బ్రిజల్కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉండడంతో అతడిపై 12 పోలీసులు కేసులున్నాయి. అతడి భార్య కూడా డ్రగ్ మాఫియాలో సంబంధాలు ఉండడంతో జైలు నుంచి మే నెలలలో విడుదలయ్యారు. బుధవారం రాత్రి 11 గంటలో సమయంలో బ్రిజల్ తన డ్రైవర్ గుర్సాహిబ్ కు ఫోన్ చేసి ఇంట్లోకి రమ్మన్నాడు. తన యజమాని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని గుర్సాహిబ్ తన కుటుంబానికి ఫోన్లో తెలియజేశాడు. గురువారం తెల్లవారుజామున బ్రిజల్ మనవరాలు తన రూమ్ నుంచి హాల్లోకి వచ్చేసరికి బ్రిజల్ రక్తపు మడుగులో కనిపించడంతో కేకలు వేసింది. వెంటనే ఇరుగుపొరుగు ఇంటికి వచ్చి… ఐదుగురు రక్తుపు మడుగులో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిజల్ చిన్న కుమారుడు గుర్జంత్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని డిఎస్పి కుల్జిందర్ సింగ్ తెలిపాడు. గుర్జంత్ సింగ్ మద్యం మత్తులో ఉన్నాడని అతడే ఈ కేసులో కీలక వ్యక్తి అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.