Tuesday, April 30, 2024

భారత్‌లో దిగిన లంక క్రికెటర్ల విమానం

- Advertisement -
- Advertisement -

Flight carrying Sri Lankan players forced to land in India

 

కొలంబో: ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక క్రికెట్ జట్టుకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇంధన సమస్య తలెత్తడంతో లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న విమానాన్ని హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న క్రికెటర్లు, సహాయక సిబ్బంది కొంత సేపు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని లంక క్రికెట్ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. ఇంధన సమస్య తలెత్తడంతో తాము ప్రయాణిస్తున్న విమానాన్ని భారత్‌కు దారి మళ్లీంచారు. అక్కడ మేం దిగగానే నా ఫోన్‌ను ఆన్ చేశాను. ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి నాకు అప్పటికే కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. విమానం భారత్‌లో దిగిన విషయాన్ని అందులో వివరించారు. దాంతో తామంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యామని ఆర్థర్ పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా శ్రీలంక వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడింది. తాజాగా భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా లంక పాల్గొననుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News