- Advertisement -
రాంఛీ: ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడడంతో ఓ క్రీడాకారుడు మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్లోని గుమ్లా జిల్లా ఉరుబార్డి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 17వ తేదీన మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షంతో ఉరుములు మెరుపులు వచ్చి పెద్ద శబ్దంతో పిడుగుపడింది. వెంటనే ఐదుగురు ఆటగాళ్లు కిందపడిపోయారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పరాస్ పన్నా ఆటగాడు మృత్యువాతపడ్డారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోనే 2019వ సంవత్సరంలోనే 334 మంది చనిపోయారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలా నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
- Advertisement -