చెన్నై: భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చిందనే కోపంతో ఆమెను కుర్చీలో కట్టేసి నోట్లో వస్త్రం కుక్కి ఆమెపై భర్త పెట్రోల్ పోసి తగలబెడుతుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన తమళినాడులోని కన్యాకుమారి జిల్లా కోల్ఖేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నడువిల్ గ్రామంలో సురేష్ రాజన్(53), హెప్సీ (45) అనే దంపతులు ఉన్నారు. ఎర్నియల్ ప్రాంతంలో స్థానిక కోర్టులో హెప్సీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేయడం సురేష్కు ఇష్టం లేదు. ఆమెను సూటీపోటి మాటలతో వేధించడమే కాకుండా పలుమార్లు దాడి చేశాడు. ఆమెను ఎంత వేధించిన జాబ్కు వెళ్తుండడంతో కత్తితో ఆమెపై దాడి చేసి చైర్కు కట్టేశాడు అనంతరం నోట్లో వస్త్రాన్ని కుక్కిన అనంతరం ఆమెపై పెట్రోల్ పోస్తుండగా అరవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కోర్టులో జాబ్ చేస్తుందని భార్యపై పెట్రోల్ పోసి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -