Thursday, May 2, 2024

రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -
Former Mlc Vakati Narayanareddy Join TDP
పసుపు కండువ కప్పుకున్న మాజీ ఎంఎల్‌సి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డి

అమరావతి : రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎంఎల్‌సి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు శుక్రవారం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. జమ్మలమడుగు టిడిపికి కంచుకోటని అని అన్నారు. జమ్మలమడుగులో పార్టీకోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. సిఎం జగన్‌కు అనుభవం లేకనే ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారని ఆరోపించారు. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని, ఈసారి పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News