Monday, April 29, 2024

నటి కంగనారౌనత్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered against Kangana in Nampally court

హైదరాబాద్:  భారత స్వాతంత్య్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రౌనత్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్రంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టు విచారణ చేపట్టింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యానించారని న్యాయవాది కొమిరెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. కంగనా వ్యాఖ్యలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News