- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్ధివదేహాన్ని ఆర్మీ ఆస్పత్రి నుంచి రాజాజీ మార్గం గుండా ఢిల్లీలోని అధికారిక నివాసానికి తరలించారు. ప్రణబ్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాసేపట్లో మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్ నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11-12 గంటల మధ్యలో ప్రజలు ఆయన భౌతికకాయాన్ని దర్శించవచ్చని అధికారులు తెలిపారు. 12 గంటలకు గార్డ్ ఆఫ్ హానర్ అనంతరం మధ్యహ్నం 2గంటలకు అంతియ యాత్ర ప్రారంభం కానుంది. లోధి శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా దృష్ట్యా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు.
Former President Pranab Mukherjee funeral
- Advertisement -