Saturday, May 4, 2024

దేశంలో మరో 69,921 మందికి సోకిన కరోనా

- Advertisement -
- Advertisement -

69921 new Covid 19 cases 819 deaths reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,921 కరోనా కేసులు, 819 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు 36,91,167కి చేరాయి. వీటిలో 7,85,996 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 28,39,883 నయమై కోలుకున్నారు. ఇండియాలో 65,288 మంది కరోనా బాధితులు మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,33,24,834 కోవిడ్ టెస్టులు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధన మండలి) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులోనే 10,16,920 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

69921 new Covid 19 cases 819 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News