Friday, May 3, 2024

తెలంగాణలో కొత్తగా 2,734 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

2734 new Covid 19 cases recorded in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కోరలు చాపుతోంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,734 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో తొమ్మిది మంది కోవిడ్-19తో మృతి చెందగా.. 2,325 మంది ఈ  మహమ్మారి నుంచి  కోలుకున్నారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,27,697కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 31,699 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 95,162 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటిదాకా 836 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాగాజా విడుదలైన కరోనా బులిటెన్ ప్రకారం హైదరాబాద్ లో కొత్తగా 347మందికి కరోనా సోకింది. 24,598 మంది బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

2734 new Covid 19 cases recorded in Telangana

2734 new Covid 19 cases recorded in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News