- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు మంత్రి రాజ్ నాథ్ సింగ్, హర్ష వర్ధన్, నిర్మలా సీతారామన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిడిఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులతో సహా పలువురు మంత్రులు, రాజకీయ నేతలు తరలివెళ్లి ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రధ్దాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
President Kovind paid last respects to former President
- Advertisement -