Thursday, May 2, 2024

కేంద్ర మాజీ మంత్రి జ‌శ్వంత్ సింగ్ క‌న్నుమూత‌

- Advertisement -
- Advertisement -

Former union minister Jaswant Singh passes away

 

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జ‌శ్వంత్ సింగ్ (82) ఆదివారం ఉదయం కన్నుమూశారు.  జ‌శ్వంత్‌సింగ్‌ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడి, నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా పని చేశారు.  2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్షనేతగా పని చేశారు. రాజస్థాన్లోని జసోల్ 1938 జనవరి 3న జన్మించారు. జ‌శ్వంత్‌సింగ్ మృతిప‌ట్ల ప్ర‌ధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జ‌శ్వంత్ సైనికుడిగా, రాజ‌కీయ నేత‌గా దేశానికి సేవలందించార‌ని మోడీ కొనియాడారు. దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘ అనుబంధ‌ం ఉందని, మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వంలో ఆయ‌న కీలక పాత్ర పోషించార‌ని.  ఆర్థిక‌, ర‌క్ష‌ణ‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News