- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ కలవరపాటుకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. శనివారం ఒక్క రోజే రెండు వేల వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1.85 లక్షలకు చేరుకోగా 1100 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 1.54 లక్షల మంది కోలుకోగా 30 వేల మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 82 శాతంగా ఉండగా మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. శనివారం ఒక్క రోజు 50 వేల టెస్టులు చేయగా 28.5 లక్షల మంది కరోనా టెస్టులు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
- Advertisement -