- Advertisement -
భోపాల్: కరోనా లాక్ డౌన్ లో బాగా ఫేమస్ అయిన లూడో గేమ్ ఓ తండ్రికూతుర్ని కోర్టుకు లాగింది. లూడో గేమ్ లో తండ్రి తనను ఓడించాడని కూతురు కోర్టును ఆశ్రయించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే 24 సంవత్సరాల యువతికి తన తండ్రి అంటే అమితమైన ప్రేమ. వాళ్లిద్దరూ తాజాగా లూడో గేమ్ ఆడారు. ఆటలో తండ్రి తనను ఓడిచడంతో ఆమె కుంగిపోయింది. తనను ఎంతో ఇష్టపడే నాన్న.. మోసం చేశాడని భావించి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం వచ్చిన కోర్టు కౌన్సిలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కరోనా లాక్ డౌన్ లో లూడో గేమ్ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
Beaten by father in ludo in Bhopal
- Advertisement -