Sunday, May 5, 2024

నోయిడాలో కూలిన ప్రహారీ గోడ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో మంగళవారం ఉదయం ప్రహారీ గోడ కూలింది. సెక్టార్ 21లోని జలవాయు విహార్ ప్రహారీ గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్, డిఎం సుహాష్ క్షతగాత్రులను పరామర్శించారు. భారీ వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరుకున్న గోడలు, ఇండ్లు కూలిపోతున్న సంగతి తెలిసిందే. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ సంతాపం తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News