Thursday, May 2, 2024

లోయలో సొరంగం కూలి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four workers killed in tunnel collapse in Kullu

మనాలి: హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలోని గాడ్సా లోయలోని పంచనాలా సమీపంలో జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పిసి) నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఒకరిని రక్షించారు. నిన్న సాయంత్రం 5:40 గంటల సమయంలో 600 మీటర్ల పొడవు గల డైవర్షన్ టన్నెల్‌లో కార్మికులు డ్రిల్లింగ్ పని చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతం మొత్తం కూలిపోయిందన్నారు. నాలుగు మృతదేహాలను శిధిలాల కింద గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.

Four workers killed in tunnel collapse in Kullu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News