Thursday, May 2, 2024

మరోసారి 4వేలు దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

India reports 257299 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 2,57,299 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,57,630 డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మరోసారి కరోనా మరణాలు 4వేలు దాటాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కి చేరింది. తాజా నమోదైన 4,194 మరణాలతో కలుపుకుని ఇండియాలో ఇప్పటివరకు 2,95,525 మందిని కరోనా కబలించింది. భారత్ లో ప్రస్తుతం 29,23,400 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 19,33,72,819 మందికి టీకా డోసులు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 2021 మే 21 వరకు 32,64,84,155 నమూనాలను పరీక్షించారు. వీటిలో 20,66,285 నమూనాలను నిన్న పరీక్షించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

India reports 257299 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News