- Advertisement -
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం గోర్సలో దారుణం జరిగింది. దుండగులు బాలుడిని చంపి చెట్టుకు ఉరితీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 12 ఏళ్ల బాలుడు గోపాలం నిన్న సాయంత్రం 4గంటల సమయంలో కనిపించకుండాపోయాడు. శనివారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
thugs who killed the boy and hanged him to tree
- Advertisement -