Saturday, April 27, 2024

ఆ ఆస్పత్రి రావడం… వరంగల్ ప్రజల అదృష్టం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Super specialty hospital in Warangal.

హైదరాబాద్: కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ చర్యలపై కరోనా బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వరంగల్ లో సిఎం కెసిఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనుకోవడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వరంగల్ జిల్లాను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎంజిఎం ఆస్పత్రిని మాతా శిశు ఆస్పత్రిగా ఏర్పాటు చేసేందుకు సిఎం నిర్ణయం తీసుకున్నారని, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వరంగల్‌కు రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ సంకల్పించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News