Sunday, April 28, 2024

ఉచితంగా రూ. 1000 విలువైన కరెంట్: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమీర్‌పేటలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ ప్రారంభించారు. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు పొన్నం ఇచ్చారు. ఒక్కో ఇంటికి రూ. వెయ్యి విలువైన కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని పొన్నం తెలియజేశారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, అనవసరమైన విమర్శలొద్దని సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలు పూర్తి చేస్తామని పొన్నం వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News