Monday, April 29, 2024

ఆర్డీవోపై సిఎస్ కు ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కరువు వచ్చిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అటు హనుమకొండ ఆర్టీవో పై మంత్రి పొన్నం సిఎస్ కు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News